21-06-2025 01:33:11 AM
రూ.౨ కోట్ల జిపి నిధుల అంశంలో అవకతవకలు
రాజేంద్రనగర్, జూన్ 20: గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం కేసులో పు ప్పాలగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మహేశ్వరం సునీతను నార్సింగి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కేసు వివరాలను ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి వెల్లడించారు. సునీత తన పదవీ కాలంలో పంచా యతీ నిధులు రూ.2,02,30,885ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాజేంద్రనగర్ డివిజన్ డివిజినల్ పంచాయతీ అధికారి ఫిర్యాదు మేరకు జిపి నిధు లు పెద్దమొత్తంలో దారి మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్ గ్రామ పంచాయతీ ట్రి బ్యూనల్ ఆదేశాల మేరకు దుర్వినియోగమైన మొత్తంలో రూ.23,68,618 ను తిరిగి చెల్లించినా, ఈ చర్య పబ్లిక్ సర్వెంట్గా నమ్మకద్రోహం,మోసానికి సంబంధించింద న్నా రు. తెలంగాణ లోకాయుక్త ఆదేశాల మేరకు, క్రైమ్ నెంబర్ 853/2025 లో 409, 420 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
విచారణలో ట్రిబ్యూనల్ ఉత్తర్వులు, విచారణ నివేదికలు, చలాన్లు, బాధితురాలి లిఖిత పత్రాలు, ఆధారాలు దొరికాయి. దీంతో మా జీ సర్పంచ్ సునీతను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. నిధుల దుర్వినియోగంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఒకటవకులకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ సూచించారు.