30-05-2025 03:19:48 AM
ముల్లన్పూర్, మే 29: ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో క్వాలిఫయర్-1లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత పంజాబ్ 14.1 ఓవర్లలోనే 101 పరుగులకే కుప్పకూలింది. స్టోయినిస్ (26) టాప్ స్కోరర్. బెంగళూరు బౌలర్లలో హాజిల్వుడ్, సుయాశ్ శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఛేదనలో బెంగళూరు 10 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 106 పరుగులు చేసి గెలుపొందింది. సాల్ట్ (56 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో రాణించాడు. నేడు జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ పంజాబ్తో అమీతుమీ తేల్చుకోనుంది.