31-05-2025 02:26:56 AM
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ (గుర్తింపు) పొందడంలో కాలేజీల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా యి. యేటా ఏప్రిల్లో ప్రభుత్వం అఫిలియేషన్లకు నోటిఫికేషన్ ఇవ్వడం.. కాలే జీలు సమయానికి సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోకపోవటం.. గుర్తిం పు ఇవ్వకుండానే ఇష్టానుసారంగా అడ్మిషన్లను చేపట్టడం.. చివరికి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆయా కాలేజీలకు అఫిలియేషన్లనివ్వడం షరామామూలుగా మారుతోంది.
2025-26 నూతన విద్యాసంవత్సరం జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. అధికారుల లెక్కల ప్రకారం ఇంతవరకు 18 శాతం ప్రైవేట్ కాలేజీలు మాత్రమే ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు పొందాయి. ఇంకా 82 శాతం కాలేజీలు గుర్తింపే పొందకపోవటం గమనార్హం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ జూనియర్ కాలేజీలతోపాటు ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు కలిపి మొత్తం 3,064 ఉన్నాయి. అయితే ఇందులో 1,222 కాలేజీలు ప్రైవేట్వే ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 217 కాలేజీలు మాత్రమే అఫిలియేషన్లు పొందాయని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
అఫిలియేషన్లు పూర్తయ్యేదెప్పుడు..
మరో రెండు రోజుల్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటివరకు 1,005 ప్రవేట్ కాలేజీలు గుర్తింపును పొందకపోవటం గమనార్హం. మొత్తం 3,064 కాలేజీల్లో 415 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 373 ప్రభుత్వరంగ కాలేజీలకు అఫిలియేషన్లు పూర్తయ్యాయి. కానీ ప్రైవేట్ కాలేజీల అఫిలియేషన్లు పూర్తి కాలేదు. కానీ ఇవేమీ పట్టనట్టు కొన్ని కాలేజీలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతూ, తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి.
తీరా సమస్య ముదిరాక, ఈ ఒక్కసారికి అఫిలియేషన్ ఇవ్వాలంటూ అటు ఇంటర్ బోర్డు అధికారులకు, ఇటు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తుంటారు. ఈ అంశాన్ని కొన్నిరోజుల పాటు నాన్చి, చివరి క్షణంలో గుర్తింపులిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. వాస్తవానికి ఇంటర్ బోర్డు అఫిలియేషన్ నోటిఫికేషన్ను ఏప్రిల్ 3న విడుదల చేసి, అదే నెల 5వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
నిర్దేశిత ఫీజు చెల్లించి ఆయా కాలేజీలు ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువిచ్చారు. రూ.1000 లేట్ ఫీజుతో మే 11 వరకు గడువు, రూ.5 వేలతో మే 18 వరకు, రూ.10 వేలతో మే 25 వరకు, రూ.15 వేలతో జూన్ 1 వరకు, రూ.20 వేలతో జూన్ 8 వరకు గుడువిచ్చింది. కానీ ఇంకా 1,005 వరకు కాలేజీల గుర్తింపు పెండింగ్లోనే ఉన్నాయి.
డాక్యుమెంట్లు లేకుండానే దరఖాస్తులు..
గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారీగా ఫీజులను చెల్లించి, కళాశాల భవన రిజిస్ట్రేషన్ డీడ్ లేదా లీజు డీడ్, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ, కార్పస్ ఫండ్, స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికెట్, శానిటరీ సర్టిఫికెట్, బోధనా సి బ్బంది డాక్యుమెంట్లు, ఆటస్థలం డాక్యుమెంట్లను దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా సమ ర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్క డాక్యుమెంట్ లేకున్నా ఆ కాలేజీల గుర్తింపును నిలిపేస్తారు. అయితే ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న మొత్తం 1,222 కాలేజీల్లో 1,005 కాలేజీలు సరైనా డాక్యుమెంట్లను సమర్పించలేదని తెలుస్తోంది. అందుకే వాటి గుర్తింపును పెండింగ్లో పెట్టామని అధికారులు చెబుతున్నారు.
సరైనా ధ్రువపత్రాలుంటేనే అనుమతి: ఇంటర్ బోర్డు
నోటిఫికేషన్లో తెలిపిన విధంగా అన్ని రకాల సర్టిఫికెట్లతో అఫిలియేషన్లకు దరఖాస్తు చేసుకుంటేనే గుర్తింపునిస్తాం. సరైనా ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుంటున్న కాలేజీలకు ఇప్పటివరకు గుర్తింపు ఇచ్చాం. నోటిఫికేషన్ విడుదల చేసి రెండు నెలులు కావొస్తోంది. అయినా కాలేజీలు ముందుకు రావడంలేదు. జూన్ 8తో రిజిస్ట్రేషన్ గడువు ముగిస్తుంది. ఈలోపు దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు తర్వాతైనా అఫిలియేషన్ ఇస్తాం. అఫిలియేషన్ లేకుండా అడ్మిషన్లు తీసుకోవటం ఇంటర్బోర్డు నిబంధనలకు విరుద్ధం. ఆయా కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరిస్తోంది.
దరఖాస్తు సమయంలో అవసరమయ్యే సర్టిఫికెట్లు
* వ్యాలీడ్ బిల్డింగ్ ఓనర్షిప్/రిజిస్టర్డ్ లీజ్ డీడ్ ఆఫ్ కాలేజ్ బిల్డింగ్
* బిల్డింగ్ ప్లానింగ్ అప్రూవల్ సర్టిఫికెట్
* ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్/ ఫైర్ ఎన్వోసీ
* వ్యాలీడ్ ఎఫ్డీఆర్ (కార్పస్ ఫండ్)
* స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికెట్
* శానిటరీ సర్టిఫికెట్
* టీచింగ్ స్టాఫ్ డాక్యుమెంట్స్
* ప్లే గ్రౌండ్ సంబంధిత డాక్యుమెంట్లు