15-06-2025 12:38:15 AM
గవర్నర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన చైర్మన్ లయన్ నటరాజ్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్(Red Cross Blood Bank)కు బెస్ట్ అవార్డు లభించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రాజభవన్ సంస్కృతి హాల్ లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(State Governor Jishnu Dev Verma) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 ఆశ్రమం, అక్షర పాఠశాల, శాంతివన్(మానసిక వికలాంగుల) పేదలకు విశేష సేవలందిస్తున్న జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ను పాలక కమిటీ సభ్యులను గవర్నర్ ప్రశంసించారు. కాగా 160 సార్లకు పైగా రక్త దానం చేసి రాష్ట్ర పతి అవార్డు అందుకున్న లయన్ నటరాజ్ ను గవర్నర్ ప్రత్యేకంగా అభినoదించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నర్ యం.దాన కిషోర్, జాయింట్ సెక్రటరీ టు గవర్నర్ భవానీ శంకర్, రెడ్ క్రాస్ సెక్రెటరీ జనరల్ ప్రొఫెసర్ ఎ .శ్రీరాములు, కోశాధికారి ఓ.ఎస్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.