calender_icon.png 23 June, 2025 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడిలోనే మెరుగైన విద్య

13-06-2025 01:53:50 AM

మెదక్ డీఈఓ డాక్టర్ రాధాకిషన్ 

పాపన్నపేట, జూన్ 12 : ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. పాఠశాలల పునర్ ప్రారంభం సందర్భంగా గురువారం పాపన్నపేట మండల పరిధిలోని గాజుల గూడెం ప్రాథమిక పాఠశాలను డీఈఓ సందర్శించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గాను ప్రభుత్వం ఈసారి నుండి పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో సైతం ఏఐ ద్వారా బోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుందని దీనివల్ల విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఈవో ప్రతాప్రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ అంజు మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిసిరి, ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, వేణుగోపాల్, సాయిలు, చారి, పిఎసిఎస్ పాపన్నపేట చైర్మన్ మల్లేశం గుప్త, గ్రామస్తులు పాల్గొన్నారు.