calender_icon.png 4 June, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోపణలు చేస్తే అభివృద్ధి జరగదు

03-06-2025 12:38:43 AM

  1. పాత బజారుకు బాజాప్త  రోడ్డు ఉంది 
  2. జనాలను ఇబ్బంది పెడితే చరిత్ర హీనులుగా మిగులుతారు
  3. రహదారి విషయంలో పరిహారం ఎక్కడా ఇవ్వలేదు
  4. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి 

మహబూబ్‌నగర్, జూన్ 2 (విజయక్రాంతి): ప్రజలకు మంచి చేయడం మరిచి కేవలం ఆరోపణలు చేసుకుంటూ ముందుకు సాగితే అభివృద్ధి జరగదని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జడ్చర్లలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.

జడ్చర్ల మీదుగా వెళ్తున్న కోదాడ జాతీయ రహదారి ,జడ్చర్ల  మీదుగా చించోలి వరకు వెళ్తున్న మరో జాతీయ రహదారి విషయంలో ప్రజలకు అనేక సం ఘాలు తీసుకురావడం మంచి పద్ధతి కాదన్నారు.  పాత బజారుకు వెళ్లేందుకు హెవీ వెహికల్స్ రావడానికి అవకాశం లేదని సోషల్ మీడియాలోనూ పలు పత్రికల్లోనూ వార్తలు వచ్చాయని జనాల్లోనూ ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉందని తెలిపారు.

గతంలో నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు రై ల్వే ఓవర్ బ్రిడ్జ్ ఫ్లై ఓవర్ వేసేందుకు డిజైన్ చేశారని, సదరు డిజైన్ వల్ల నేతాజీ చౌక్ కానీ నాగర్ కర్నూల్ కు వెళ్లే వాళ్లకు, పాత బజార్ కు వెళ్లేందుకు చాలా దూరం ముందుకు వెళ్లి తిరి గి టర్న్ చేసుకొని వచ్చే పరిస్థితి ఏర్పడేదన్నారు.ఇదే విషయం తెలుసుకున్న తాను అధికారులతో మాట్లాడడం జరిగిందని అయితే అప్పటికే టెండర్లు  పూర్తయిందని ప్రక్రియ ఆపేందుకు వీలుకాదని తెలిపారన్నారు.

అప్పుడు తాను అధికారు లతో కలిసి మాట్లాడి సర్కిల్ ఏర్పాటు చేయాలని టౌన్ లోకి పాత బజారుకు వెళ్లేందుకు ఇబ్బంది కలగకుండా డిజైన్ మార్పు కోరడంతో అందుకు అనుగుణంగానే ఇందిరా గాం ధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద సర్కిల్స్ ఏర్పాటు చేసేలా డిజైన్ మార్చినట్లు తెలిపారు.

ఈ క్రమంలో ఇటీవలే పూలే విగ్రహాన్ని రోడ్డు మధ్యలో నుంచి తీసి తర్వాత ఎక్కడ పెట్టాలి అనే విషయమై స్థానిక తాసిల్దార్ సమావేశం ఏర్పాటు చేశారని ఆ సందర్భంగా విగ్రహం అక్కడ పెడితే పాత బజార్ కు రోటే ఉండదు అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారని అది సరికాదన్నా రు.ఇదే సందర్భంలో గత మాజీ ఎమ్మెల్యే డిజైన్ మార్పు విషయంలో పట్టించుకోలేదని తన మీద కూడా ఆరోపణలు చే యడం జరిగిందని ఇది సరైన పద్ధతి కాదన్నారు.

పక్కా ప్రణాళికలతో డిజైన్ మార్పు విషయంలో కృషి చేశామని పాత బజారుకు అన్ని రకాల వాహనాలు వెళ్తాయని స్పష్టం చేశారు. హైవే నుంచి నేరుగా వెళ్లేందుకు అదే విధంగా పాత బజారుకు వెళ్లేందుకు కూడా రెండు రహదారి మార్గాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదే విషయమై తాను మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్లతో పాటు ఇతర నాయకులను నేషనల్ హైవే అధికారుల దగ్గరకు తీసుకెళ్లి వాళ్లకు కూడా అవగాహన కల్పించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత,సీనియర్ నాయకులు బాదేపల్లి రంజిత్ బా బు,పిట్టల మురళి,కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్ రెడ్డి,బుక్క మహే ష్, ఉమా శంకర్ గౌడ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.