10 May, 2026 | 8:08 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి

22-06-2024 03:48 AM
  • ఎంపీ మల్లు రవి

గద్వాల (వనపర్తి), జూన్ 21 (విజయక్రాంతి): వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఎంపీ మల్లు రవి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం ఆయన జడ్పీ చైర్‌పర్సన్ సరితతో కలిసి సందర్శించి సంబంధిత అధికా రులకు పలు అంశాలపై సూచనలిచ్చారు. విద్యార్థినులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఐటీఐ కళాశాల పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.75 లక్షలు మంజూరు చేయిస్తానన్నారు. తర్వాత ఎంపీ వనపర్తి జిల్లా కేంద్రాని చేరుకున్నారు. ఎమ్మెల్యే తూడి  మేఘారెడ్డితో కలిసి ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. తెలంగాణ లో బీఆర్‌ఎస్ మునిగే నావ అని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలను సందర్శించారు. పర్యటనలో డీఈవో గోవిందరాజులు ఉన్నారు.