10 May, 2026 | 9:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలి

22-06-2024 03:46 AM
  • నిజామాబాద్ ఎంపీ అర్వింద్

నిజామాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): నిజామాబాద్ శివారులో చేపడుతున్న మాధవనగర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులను సత్వరం పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆదేశించారు. శుక్రవా రం ఆయన పనులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మాధవనగర్, అడవి మామడిపల్లి, అర్సాపల్లి, ఆర్మూర్ మామిడిపల్లి రైల్వే వంతెన పనులపై రోడ్లు భవనాలశాఖ అధికారులతో జిల్లాకేంద్రం లో సమీక్షించారు. కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకపోవడంతో నత్తనడకన పనులు సాగుతున్నాయని, వెంటనే రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటి వెంకటరెడ్డి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం నిర్మాణాలకు కేటాయించిన నిధులను ఇతర పనులకు మళ్లించిందన్నారు.