23-06-2025 01:21:06 AM
- ఆ రెండు పార్టీల హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్రెడ్డి
- మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట, జూన్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్, టీడీపీ రెండూ తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
గతంలో రాజశేఖర్రెడ్డి కృష్ణా నది దోచుకపో తే, నేడు చంద్రబాబు గోదావరిని దోచుకుంటున్నాడన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలయికలో పుట్టిన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్రెడ్డి అని మండిపడ్డారు. నదులు ఎక్కడ ఉన్నాయో తెలియని రేవంత్ ఇక్కడ దేనినైనా అమ్మడానికి వెనకాడట్లేదన్నారు. 350 టీఎంసీల ప్రాజెక్టును కట్టి రాజశేఖర్రెడ్డి దుర్మార్గంగా కృష్ణా నీళ్లను తీసుకుపోతుంటే ఆనాటి కాంగ్రెస్, టీడీపీ నాయకులు నోరు మెదపలేదన్నారు.
ఈనాడు గోదావరిని కూడా దోచుకుపోతుంటే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నోరు మెదపకపోవడం దారుణం అన్నారు. ఈ దారు ణాన్ని బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సహించరని చెప్పారు. కేసీఆర్ మరో ఉద్యమం చేస్తే తప్పా తెలంగాణ జలదోపిడీపి ఆపలేమని పేర్కొన్నారు. బండి సంజయ్, రేవంత్రెడ్డి తెలంగాణ ద్రోహులేని ఫైర్ అయ్యారు. కేసీఆర్ను జైల్లో పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒకల్ని మించి మరొకరు పోటీ పడుతున్నారని దుయ్యబట్టారు.
బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే మనకిచ్చిన రిటర్న్ గిఫ్టు బనకచర్ల రూపంలో చంద్రబాబుకు గోదారి నీళ్లను దోచిపెట్టడమే అని మండిపడ్డారు. 11 ఏళ్ల నుంచి ఈడీ, ఐటీ, ఏసీబీ, సీఐడీలు కేసీఆర్పై డేగ కళ్లు వేసుకొని చూసినా ఎవరేం చేయలేకపోయారని, ఎవరెన్ని చేసినా కేసీఆర్ను జైల్లో పెట్ట లేరు అని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అన్నారు.