01-06-2025 12:24:27 AM
నంబాల మృతికి నిరసనగా మావోయిస్టుల పిలుపు
హుస్నాబాద్, మే 31: మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు, ఇతర మావో యిస్టుల మరణానికి నిరసనగా జూన్ 10న భారత్ బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరున లేఖ విడుదల చేశారు.
మే 21న ఛత్తీస్గఢ్ నారాయన్పూర్ జిల్లా మాడ్ ప్రాంతం లో భద్రతా దళాలు నంబాలతోపాటు మరో 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశాయని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాల ఆదేశాల మేరకే ఇది జరిగిందని ఆరోపించారు. తమ బలగాల చర్యలను మోదీ గర్వకారణంగా, అమిత్ షా చారిత్రాత్మక విజయంగా ప్రకటించుకోవడం వారి రక్తపిపాస, నరహంతక స్వభావాన్ని నిర్లజ్జగా ప్రకటించుకోవడమే అని అభయ్ ఖండించారు.