calender_icon.png 6 June, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 మంది మావోయిస్టుల లొంగుబాటు

01-06-2025 12:25:48 AM

ములుగు/మహబూబాబాద్, మే 31 (విజయక్రాంతి): ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఎదుట శనివారం 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో డివిజన్ కమిటీ సభ్యుడు దొర్పటి మిర్గు అలియాస్ శివలాల్‌తోపాటు ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ముగ్గురు పార్టీ సభ్యులు, ఇద్దరూ మిలిషియా సభ్యులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారు మహారాష్ట్ర గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌కు చెందిన వారని తెలిపారు. ములుగు జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 68 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఎస్పీ వివరించారు.