భూదాన్ భూముల కుంభకోణం!
- లక్ష ఎకరాలు ఏమయ్యాయి?
- ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): తెలంగాణలో భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చివేయడం హిమశైలం అంచు మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూదాన్ భూము లు రాజకీయ నాయకులు, రియల్ మాఫి యా చేతుల్లో బందీ అయ్యాయని ఆరోపించారు.
తెలంగాణలో వినోబా భావే సేకరిం చిన 1.82 లక్షల ఎకరాల భూదాన్ భూములపై తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, ఏయే జిల్లాలో ఎంత భూమి ఆక్రమణకు గురైందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమిలో దాదాపు లక్ష ఎకరాలకు పైగా క్షేత్రస్థాయిలో మాయమయ్యా యని, ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, ఖమ్మం జిల్లాల్లో వేల కోట్ల రూపాయల విలువైన భూములను రియల్ ఎస్టేట్ గద్దలు మింగేశాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాం డ్ చేశారు.
ఆక్రమణల నుంచి విడిపించిన భూములను నిరుపేదలకు, దళిత, గిరిజన కుటుంబాలకు పంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూదాన్ భూముల రక్షణ కోసం బాధితులందరినీ ఏకం చేసి ’చలో అసెంబ్లీ’ నిర్వ హిస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల ఎకరాల భూమిలో కేవలం 1.14 లక్షల ఎకరాలే పంచారని, మిగిలిన 68 వేల ఎకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. ‘హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో 21వేల ఎకరాల భూదాన్ భూమి ఉంటే, అందులో 13వేల ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు రిపోర్టులు చెపుతున్నాయని వివరించారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు.





