calender_icon.png 2 June, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు నష్టం జరగకుండా అండగా ఉంటున్నాం

31-05-2025 08:47:51 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి,(విజయక్రాంతి): రైతులకు నష్టం జరగకుండా ఎప్పటికీ అండగా ఉంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నియోజకవర్గంలోని జూలపల్లి మండలం పెద్దాపూర్, బాలరాజు పల్లి, కుమ్మరి కుంట, కీచులాటపల్లి, కాచాపూర్ గ్రామాల్లో శనివారం సీసీ రోడ్లు & డ్రైనేజిలు, పాఠశాల ప్రహరీ గోడ, వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణల కోసం రూ.1 కోటి 35,00,000/- నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.

అనంతరం కుమ్మరికుంట సింగిల్ విండో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని  స్థానిక నాయకులుతో కలిసి సందర్శించరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు  మాట్లాడుతూ... గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో పేదలను పట్టించుకోకుండా ఇండ్లు మంజూరు చేయలేదని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దశలవారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అర్హులైన అందరికీ ఇండ్లను మంజూరు చేస్తామని, మలిదశలోనూ అర్హులైన వారిని గుర్తించి ఇండ్లు ఇప్పిస్తామన్నారు.

గతంలో తడిసిన వడ్లను సెంటర్లలో కొనుగోలు చేయించిన సందర్భం లేదని, తాను తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేయించి మిల్లులకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి కటింగులు లేకుండా వడ్లు కొనుగోలు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. అప్పటి పాలకులకు, తమకు ఉన్న తేడాను గమనించాలని ఆయన కోరారు. ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు పలు సమస్యలను ఎమ్మెల్యే  దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్, ఎంపిడిఓ, వ్యవసాయ అధికారులు, హౌసింగ్ ఎంపిఓ, ప్రభుత్వ అధికారులు  మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్, సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు లోక జలపతి రెడ్డి,మరియు బొజ్జ శ్రీనివాస్, దరబోనా నర్సింగ్ యాదవ్, బొద్దుల లక్స్మణ్, కొమ్మ పోచాలు, గొట్టేముకెక్కల రవీందర్ రెడ్డి, జక్కని శంకర్, శ్రీ కొండ కొమురయ్య, ఈర్ల స్వామి, ఆర్గంటి రవీందర్ రావు, బండి స్వామి, పొన్నం రమేష్, గాగిరెడ్డి దేవందర్ రెడ్డి, శ్రీకాంత్, హరికృష్ణ, హరీష్ యాదవ్, మల్లయ్య, సంపత్, స్వామి, తిరుపతి, నరేష్,  మార్కెట్ డైరెక్టర్లు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.