31-05-2025 08:45:09 PM
మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : గెలుపు ఓటము ఒకేలా స్వీకరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. పాలమూరు అయ్యప్ప సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో ప్రథమ, ద్వితీయ విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. విన్నెర్స్ అరవింద్ 11, రన్నెర్స్ టీం విఆర్పి యూత్ వీరన్నపేట నిలిచారని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ఒక పెద్ద గెలుపుగా భావించాలని తెలిపారు. జీవితంలో ఓడి దోడుగులు అనేది సర్వసాధనమని దేనికి కూడా పొంగిపోకూడదని సూచించారు. ఎల్లప్పుడూ ఒకేలా ఉండటం వల్ల ప్రతి వ్యక్తికి ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు ఉన్నారు.