30-06-2025 07:09:43 PM
సిర్పూర్ యు (విజయక్రాంతి): మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్(Market Committee Chairman Vishwanath) సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం లబ్ధిదారులు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కనక అవినాష్, మాజీ సర్పచులు ఆత్రం ఓంప్రకాష్, పెందోర్ నాగోరావ్, కాంగ్రెస్ నాయకులు ఆత్రం దౌలత్ రావ్, ఆత్రం లచ్చు, భీమన్న తదితరులు ఉన్నారు.