31-05-2025 12:59:58 AM
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల, మే 30 ( విజయక్రాంతి ) : జూన్ 3 నుండి 20 వరకు జరిగే భూ భారతి సదస్సులను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధి కారులను ఆదేశించారు.
శుక్రవారం ఐ.డి.ఒ.సి సమావేశ మందిరంలో భూ భారతి రెవెన్యూ సదస్సుల పై తహశీల్దార్లు, డి.టి లు,ఆర్.ఐ.లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడమే ప్రభు త్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ధరణి స్థానంలో భూ భారతి చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్,ముటేషన్, నిషేధిత భూములు,ఆర్ ఓ ఆర్ మార్పులు- చేర్పులు, వారసత్వ భూములు,సాదా బైనామాలు, ఓ.ఆర్.సి వంటి సేవలు సులభతరం అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి నారాయణ, ఆర్డీఓ శ్రీని వాసరావు , తాసీల్దార్లు,డిటిలు, ఆర్.ఐ. లు తదితరులు పాల్గొన్నారు.