calender_icon.png 1 June, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించాలి

31-05-2025 12:58:53 AM

జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ

గద్వాల, మే 30 ( విజయక్రాంతి ) : యువత గంజాయి,పొగాకు వంటి మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా వారికి అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ  అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని తమ ఛాంబర్ లో మాదక ద్రవ్యాల నిర్మూలనకు నార్కోటెక్ కోఆర్డినేషన్  కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులతో మాట్లాడారు.

జిల్లాలో ని షేధించబడిన మత్తు పదార్థాల సరఫరా లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థి జీవిత ఆరంభంలోనే పొగాకు, సిగరెట్,మత్తు పదార్థాల వలన బానిసత్వం కలుగకుండా, అవగాహనతో పాటు చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థుల ప్రవర్తన,మనోవృత్తి పై విద్యాశాఖ, తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ, వారు చెడు అలవాట్ల వైపు మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్తుపదార్థాలను వినియోగిస్తున్న కొంతమంది యువకులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించామని డీఎస్పీ తెలిపారు.

మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు విద్యాశాఖతో కలిసి  కళాశాలలలో  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో గంజాయి సాగు జరుగకుండా అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సమావేశంలో డి.ఎస్.పి మొగలయ్య, డీ.డబ్ల్యు. సునంద , ఎఫ్.ఆర్.ఓ పర్వేజ్ అహ్మద్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.