01-06-2025 06:23:33 PM
ఉబేదుల్ల కొత్వాల్ ను ఘనంగా సన్మానించిన నాయకులు..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): టీపీసీసీ ఉపాధ్యక్షులు, సీనియర్ నేత, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్(Obaidullah Kotwal) జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కొత్వాల్ నివాసంలో ఆయన చేత కేక్ కట్ చేయించి పూల బోకేలు అందజేసి శాలువాలతో సన్మానం చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ... ఉబేదుల్లా కొత్వాల్ ఎన్ఎస్ యుఐ నుంచి ఎదిగి ఉమ్మడి జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ఉమ్మడి జిల్లా డిసిసి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతోమంది నాయకులు, కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలిచినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు తెలిపారు. కొత్వాల్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్, డిసిసి మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, జిల్లా కాంగ్రెస్ ఆదివాసి విభాగం అధ్యక్షులు లింగం నాయక్, నాయకులు అజ్మత్ అలీ, అవేజ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.