03-06-2025 09:20:35 PM
పెన్ పహాడ్: యేండ్ల తరబడి ఉన్న భూ సమస్యలతో సతమతమవుతున్న రైతులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులతో శాశ్వత పరిష్కారం జరుగుతున్నట్లు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ లాలూ నాయక్(Tehsildar Lalu Naik) అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని మాచారం, నారాయణ గూడెం గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సంబంధ అన్ని సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ధరణి స్ధానంలో సులభతర పరిస్కారం దిశగా భూ భారతి చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్వోఆర్ మార్పులు-చేర్పులు, వారసత్వ భూములు, సాదాబైనామాలు, ఓఆర్సీ వంటి సేవలు సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రంజిత్ రెడ్డి, సీనియర్ ఆస్టెంట్ రాధ, జూనియర్ ఆస్టెంట్ నజీర్, పుష్పలత, మామిడి సైదులు, ఓగ్గు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.