సింగారంలో బీజేపీ ప్రచారం

05-05-2024 02:01:43 AM

ఇబ్రహీంపట్నం, మే 4: యాచారం మండలం సిగారం బూత్ అధ్యక్షుడు బొల్లు జగదీశ్ ఆధ్వర్యంలో భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా యాచారం ఎంపీపీ కొప్పు సుకన్య భాషా, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ వన్నవాడ రవీందర్‌రెడ్డి.. ఉపాధిహామీ కూలీలను ఓటు అభ్యర్ధించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపాధి కూలీలకు వివరించి, పార్లమెంట్ ఎన్నికల్లో బూర నర్సయ్యగౌడ్‌ను గెలిపించాలని కోరారు.