ఇబ్రహీంపట్నం, మే 4: భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కూతరు క్యామ ఆరోని ప్రచారం నిర్వహించారు. యాచారం మండలం నంది వనపర్తిలో శనివారం ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. ప్రచారంలో ఆరోని మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మాజీ ఉపసర్పంచ్ గోవర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.