30-06-2025 03:15:48 AM
గజ్వేల్, జూన్ 29: గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 12వ వార్డులో బిజెపి గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యా దవ్ గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి అవసరాల నిమిత్తం పంపిణీ చేసినట్లు ఈ సందర్భంగా సందీప్ కుమార్ తెలి పా రు. ఈకార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నత్తి శివకుమార్, జిల్లా కౌన్సిల్ స భ్యులు చేప్యాల వెంకట్ రెడ్డి, నాయకులు పంజాల రాజు గౌడ్, కోశాధికారి హరి కుమార్, మంద వెంకట్, కాశమైన సందీప్, 128 పోలింగ్ బూత్ అధ్యక్షుడు భైరి రవి తదితరులుపాల్గొన్నారు.