calender_icon.png 30 June, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం

30-06-2025 03:17:21 AM

గజ్వేల్,జూన్29: అర్హులైన పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డ్ లో, ఆర్ & ఆర్ కాలనీ లోని పాలె పహాడ్, గజ్వేల్ మండలం అక్కారం, బెజగమ, పిడిచెడ్, అహ్మదిపూర్, శేరీపల్లీ, కోల్గుర్, అనంతరావుపల్లి, దాచారం, భుర్గుపల్లి గ్రామాలలో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పనులను తూంకుంట నర్సారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

లబ్ధిదారులతో కలిసి ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గజ్వేల్ నియోజక వర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే అర్హులైన 2938 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు అందజేసి గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, నాయకులు ఊడెం శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, సుఖేందర్ రెడ్డి, సమీర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.