calender_icon.png 30 June, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో స్వదేశీ ఉద్యమానికి నాంది పలకాలి

30-06-2025 03:12:17 AM

మెదక్, జూన్ 29(విజయక్రాంతి): దేశంలో మరో స్వదేశీ ఉద్యమానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా స్వదేశీ జాగరణ మంచ్ కో- కన్వీనర్ అజయ్ పాతక్ జీ, తెలంగాణ స్వదేశీ జాగరణ మంచ్ సంఘటన మంత్రి రచ్చ శ్రీనివాస్ జీ తెలిపారు. మెదక్ పట్టణంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అజయ్ పత్రిక్ జీ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ మానవాళికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

స్వదేశీ జాగరణ మంచ్ దేశంలోని రైతులను, వ్యాపారులను, కార్మికులను సంఘటితం చేసి  దేశీ వస్తువులను వాడాలని, వాటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి, నూతన ఉద్యోగ అవకాశాలు యువతకు లభించి స్థానిక వస్తువులకు డిమాండ్ పెరిగితే అభివృద్ధి చెందుతుందన్నారు. స్వదేశీ, సురక్ష, స్వాలంబన్, అభియాన్ సాధించే దశగా ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ స్వదేశీ జాగరణ మంచ్ కన్వీనర్ డాక్టర్ ఎస్.నారాయణ గుప్తా, ప్రవీణ్ కుమార్( లెక్చరర్ ), భాజపా ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా గడ్డం కాశీనాథ్, మెదక్ బార్ కౌన్సిల్ నాయకులు సుభాష్, వ్యాపారవేత్త శివకృష్ణ, యాదగిరి, వెంకటేష్ పాల్గొన్నారు.