29-06-2025 01:31:38 AM
మతం బూచి చూపి లబ్ధి పొందాలని బిజెపి కుట్ర పన్నుతోందని
పునర్విభజన ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా జోక్యం చేసుకోలేదు
సూడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుదు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్,(విఐకాయక్రాంతి): మతం పేరుతో కులం పేరుతో లబ్ది పొందాలని కుటిల రాజకీయాలు చేయడం బిజెపి కి వెన్నతో పెట్టిన విద్య అని నిన్నటి వరకు కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ ఒక్క రూపాయి తేలేదన్న వ్యక్తి ఈ రోజు బండి సంజయ్ అభివృద్ధి ప్రదాత అని మాట్లాడడం చూస్తే ఊసరవెల్లులు సుగ్గుపడుతున్నాయని సు డా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డుల పునర్విభజన ప్రక్రియలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోలేదని పచ్చ కామెర్ల వ్యాధి ఉన్నోళ్లకు లోకమంతా పచ్చగ కనిపించినట్టు గతంలో వీరి హాయంలో జరిగినట్టే ఇప్పుడు జరిగినట్టు భ్రమ పడుతున్నారని నరేందర్ రెడ్డి విమర్శించారు. అధికారులు అందరి వినతులను పరిగణనలోకి తీసుకుని ప్రక్రియ పారదర్శకంగా చేసిండ్రు అని నరేందర్ రెడ్డి అన్నారు.అనవసర ఆరోపణలు చేసి లబ్ది పొందాలని చూస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.ఊసరవెల్లుల మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటే ఆది పొరపాటని ఎన్నికలొస్తున్నాయంటే చాలు బిజెపి కుటిల రాజకీయాలకు తెర లేపుతుందని నరేందర్ రెడ్డి విమర్శించారు.