29-06-2025 01:35:48 AM
జయంతి సందర్భంగా కనీసం దండ కూడా వేయని నాయకులు
కరీంనగర్/ నల్లగొండ టౌన్, జూన్ 28 (విజయక్రాంతి): బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి వేడుకలు శనివారం జరగగా, పలు ప్రాంతాల్లో నాయకులు కనీసం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించలేదు. పీవీ సొంత జిల్లా కరీంనగర్ సమీపంలోని మానేరు డ్యామ్ వద్ద ఉజ్వల పార్కులో శతజయంతి సందర్బంగా పీవీ విగ్రహాన్ని ఏర్పా టు చేశారు.
దీనికి నరసింహారావు పార్క్గా నామకరణం చేశారు. పార్కు లోపల చిన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ జ యంతిని పురస్కరించుకొని కనీసం ఆయన విగ్రహానికి పూలమాలలు వేయలేదు. నల్లగొండ కేంద్రంలోని మున్సిపల్ పార్కులో ఉన్న పీవీ విగ్రహం వద్ద కూడా నాయకులెవరూ నివాళి అర్పించలేదు.