calender_icon.png 29 June, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

29-06-2025 01:28:40 AM

సత్తుపల్లి ప్రభుత్వ  ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం/సత్తుపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలలో విశ్వాసం కల్పించాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య శాఖ సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రి అంతా కలియతిరిగి, స్కానింగ్ గది, జనరల్ ఓపి, డ్రెస్సింగ్ రూం, ఇంజక్షన్ రూం, ఎక్స్ రే రూం, డెంటల్ విభాగం, ఫార్మసీ, డయాలసిస్ వార్డులను లను పరిశీలించారు. ఏఎన్సి రిజిస్ట్రేషన్, ఎన్సిడి సర్వే గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు గురించి అడిగి, సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.

పిల్లల వైద్యులు ఉన్నారా, ఏ ఏ విభాగాల వైద్యుల అవసరం ఉన్నది అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్, ఎక్స్ రే విభాగంలో టెక్నీషియన్ లు ఉన్నది, ఇంకా ఏమేం అవసరాలు ఉన్నది ఆడిగారు. వ్యాధి వచ్చాక కాక, రాకుండా నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆహారం, జీవన శైలి పై చైతన్యం తేవాలని కలెక్టర్ అన్నారు. పెయిన్ కిల్లర్ల వాడకం తగ్గించాలని, మెడికల్ షాపులు పెయిన్ కిల్లర్ల అమ్మకంపై నియంత్రణ చేయాలని అన్నారు.  కలెక్టర్ తనిఖీల సందర్భంగా డిసిహెచ్ఓ డా. రాజశేఖర్, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, అధికారులు, తదితరులు ఉన్నారు.