calender_icon.png 27 June, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందుత్వం ముసుగులో ఏకత్వంలో భిన్నత్వం సృష్టిస్తున్నది బిజెపి

26-06-2025 10:32:46 PM

శాసనసభ డిప్యూటి స్పీకర్, డోర్నకల్ శాసన సభ్యులు రామచంద్రు నాయక్...

సూర్యాపేట (విజయక్రాంతి): భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారత దేశంలో బిజెపి హిందుత్వం ముసుగులో ఏకత్వంలో భిన్నత్వాన్ని సృష్టిస్తుందని శాసనసభ డిప్యూటి స్పీకర్, డోర్నకల్ శాసన సభ్యులు రామచంద్రు నాయక్(MLA Ramachandra Naik) అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సహకారంతో ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన గురువారం జరిగిన ఆదివాసి కాంగ్రెస్ బునియాది కార్యకర్తల సమ్మేళనం ముగింపు సభలో కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మవతి, మిర్యాల ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శాసన మండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ లతో కలిసి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసి, గిరిజనులకు ఏదైనా లబ్దిచేకూరిందంటే అది కాంగ్రెస్ పార్టీతోనేనన్నారు.

ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంబాని అదానీలకు కట్టబెడుతుందని ఆరోపించారు. దేశంలో కార్పొరేట్ వ్యవస్థ, రాచరిక వ్యవస్థను తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. బిజెపి కుటిల ప్రయత్నాలను ప్రశ్నించిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలి అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాల్లో గిరిజనుల పాత్ర ఎంతో ఉందన్నారు.

త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి తండాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలన్నారు. స్థానిక సంస్థల అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రానున్న పది సంవత్సరాలు కూడా కాాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ బునియాది శిక్షణ శిబిరం జాతీయ కోఆర్డీనేటర్ రాహుల్ బాల్, కాంగ్రెస్ ఎస్టిసెల్ రాష్ట్ర కోఆర్డీనేటర్ కోట్య నాయక్ భూక్య, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, శిక్షణ శిబిరం ఇన్ చార్జీ లింగం తదితరులు పాల్గొన్నారు.