26-06-2025 10:35:57 PM
నాగారం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నాగారం సర్కిల్ సీఐ రఘువీర్ రెడ్డి(CI Raghuveer Reddy) అన్నారు. గురువారం నాగారం మండల కేంద్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో ర్యాలీ నిర్వహించి మానవహారంతో ప్రతిజ్ఞ చేసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల పరిధిలో అన్ని గ్రామాలలో డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
యువత విద్యార్థులు బాలలు రేపటి దేశ భవిష్యత్తు అని మీలాంటి యువత మాదకద్రవ్యాల బారిన పడి భవిష్యత్తుని అంధకారం చేసుకోవద్ధని సూచించారు. డ్రగ్స్ వినియోగించడం వల్ల మన యొక్క నాడీ వ్యవస్థ మన ఆధీనంలో ఉండదు అని తద్వారా శక్తి నిర్వీర్యం అవుతుందని ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హరి కిషోర్ ఎంపీడీవో మారయ్య డాక్టర్ నాగరాజు ఎస్సై ఐలయ్య ప్రిన్సిపాల్ చంద్రబాబు పోలీస్ సిబ్బంది యువకులు పాల్గొన్నారు.