calender_icon.png 27 June, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో నాలుగు రోజులే రేషన్ బియ్యం పంపిణీ!

26-06-2025 10:28:16 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు నెలల రేషన్ బియ్యం ఇప్పటివరకు తీసుకోకుండా మిగిలిపోయిన లబ్ధిదారులు ఈనెల 30 వరకు తమ బియ్యాన్ని రేషన్ షాపుల నుండి తీసుకోవాలని జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రేమ్ కుమార్(District Civil Supply Officer Prem Kumar) తెలిపారు. గడువు పొడిగించే పరిస్థితి లేదని, రేషన్ కార్డుదారులు మూడు నెలల రేషన్ బియ్యాన్ని గడువులోపు తీసుకువెళ్లాలని డీఎస్ఓ కోరారు.