16-06-2025 02:20:07 AM
మహబూబాబాద్, జూన్ 15 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘11 ఏళ్ల మోదీ ప్రభుత్వం-సం కల్పంతో సాకారం’ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఆది వారం నిర్వహించారు. సమావేశానికి ముం దుగా పహల్గాం , ఆపరేషన్ సిందూర్, అహమ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులకు మౌనం పాటించి నివాళులర్పించారు.
బిజెపి జిల్లా ఉపాధ్యక్షడు తుంపిళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం జనరంజక సాగుతోందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన గత 11 ఏళ్లలో అన్ని రంగాల్లో భారతదేశం అగ్రగామిగా దూసుకుపోతోందని, కేవలం 11 ఏం డ్లలో భారత ప్రధాని నరేంద్ర మోడీ విశేష కృషి వలన జీడీపీలో నాలుగో స్థానానికి ఎగ బాకడమే కాకుండా దేశంలోని 27 కోట్ల మంది పేద ప్రజలను పేదరికం నుంచి దూ రం చేసి, మధ్యతరగతి ప్రజలుగా మార్చిన ఘనత సాధించిందన్నారు.
కేంద్రం చేపడుతున్న దేశాభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కుల మతాలకతీతంగా తీసుకు వచ్చిన ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకుపోవాలని కార్యకర్తలకు పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు బోగోజు నాగేశ్వర చారి , బోనగిరి ఉపేందర్ , సీనియ ర్ నాయకులు మంగిశెట్టి నాగయ్య , ఎలబొయిన కర్ణాకర్ , బండి వెంకన్న,బండి శ్రీనివాస్,చేలగోల వెంకటేష్ , పూర్నకంటి భాస్కర్, బేతి వెంకన్న, జాతోత్ రమేష్, జా తోత్ సురేష్, సింగంశెట్టి మధుకర్, బనోత్ సంపత్ , చంద్రకళ, భుక్య వరుణ్పాల్గొన్నారు.