16-06-2025 02:21:27 AM
తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ర్యాంక్ సాధించిన జీవన్ సాయికుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (విజయక్రాంతి): తాజాగా విడుదలైన నీట్ (యూజీ)- 2025 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కాకర్ల జీవన్ సాయి కుమార్ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 18 వ ర్యాంకు సాధించి తెలుగోడి సత్తా చాటాడు. అలాగే సౌతిండియాలో మొదటి స్థానంలో నిలిచి సంచలనం సృష్టించాడు. ఇతర పోటీ పరీక్షలాగా కాకుండా నీట్కు ఎంతో కఠోర శ్రమ అవసరం.
సంకల్పం, విషయ నైపుణ్యం అన్నింటినీ మించి ప్రతీ విషయంపై స్పష్టత అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. అలా అనుకున్న లక్ష్యం చేరుకోవ డానికి నారాయణ మార్గదర్శిగా నిలిచిందని జీవన్ సాయికుమార్ పేర్కొన్నాడు. ఈ ఏడాది నీట్ పరీక్ష ఎంతో సంక్లిష్టంగా ఉంది. అందులో 720 మార్కులకు గానూ జీవన్సాయి 670 మార్యులు సాధించడం గమనా ర్హం.
ఈ సందర్భంగా జీవన్ సాయి మా ట్లాడుతూ.. ‘మేము ఉండేది హైదరాబాద్. మా స్వగ్రామం దేవరపల్లి మండలం, దుద్దుకూరు, నాన్న ప్రొఫెసర్ గంగాధర నాగ కుమార్, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, అమ్మ నలినీదేవి గృహిణి. నా చదువంతా హైదరాబా ద్లోనే సాగింది. 6వ తరగతి నుంచి నారా యణ సీవో స్కూల్లో చదివా, సీబీఎస్ఈ లో బెర్త్ లో 90 శాతం, ప్లేస్టు మాదాపూర్ నారాయ ణ కాలేజీలో 98 శాతం మార్కులొ చ్చాయి.
అక్కడే నీట్ శిక్షణ కూడా తీసుకున్నాను. చిన్నతనం నుంచే వైద్యరంగమంటే ఇష్టం. దానికి నా తల్లిదండ్రులే ప్రేరణ. చిన్ననాటి నుండే ఈ రంగానికి రావాలనే ఆలోచనకు బీజం పడింది. నీట్కు సన్నద్ధమై, ఆలిండియా ర్యాంకు కోసం అహర్నిశలు కష్టపడిఆలిండియా 18వ ర్యాంకు సాధించాను’ అని పేర్కొన్నాడు. నారాయణ గైడెన్స్తో ఎంతో ఉపకరించిందని చెప్పుకొచ్చారు.