30 March, 2026 | 2:35 AM

రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

08-02-2025 01:33 AM

గవర్నర్ దత్తాత్రేయ దిగ్భ్రాంతి 

ముషీరాబాద్, ఫిబ్రవరి 7: కవాడిగూడకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు రంగరాజు గౌడ్ (73) శుక్రవారం చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రంగరాజుగౌడ్ మృతి బీజేపీకి తీరని లోటు అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 35 సంవత్సరాలుగా రాజుగౌడ్‌తో అనుబంధం ఉందన్నారు.