23-06-2025 03:30:01 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ కూరగాయల మార్కెట్ సముదాయాలను అర్హులకు ఇవ్వాలని బిజెపి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి డిమాండ్ చేశారు. సోమవారం బెల్లంపల్లి మార్కెట్ రోడ్ లో రాస్తారోకో చేశారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ శెటర్స్ కేటాయింపుల్లో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అనర్హులు పెర్లు జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ మాట్లాడుతూ... 30,40 సంవత్సరాల నుండి కూరగాయల అమ్ముతూ ఎండనక వాననక జీవనం సాగిస్తున్న వారికి మార్కెట్లో షెటర్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్ భార్యలకు బంధువులకు షట్టర్లు కేటాయించారని ఆరోపించారు. కాంగ్రెస్ అండదండలతోనే ఈ అవకతవకలు జరిగాయన్నారు. అంతేకాకుండా లంచాలు తీసుకుని షాప్ లు కేటాయించారనీ ఆరోపించారు.అడిగారు. అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అర్హులైన నిరుపేద చిరు వ్యాపారుల పక్షాన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని వెల్లడించారు.