23-06-2025 03:36:28 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): ఈనెల 8వ తేదీన మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ చేసిన నిందితుడు ఆత్రం ప్రశాంత్ ను సోమవారం ఉదయం నిజాంసాగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని చోరీ చేసిన నగదు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ మహ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన మన్నె శేఖర్ అనే కుటుంబీకులు పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు రెండు మూడు రోజుల వరకు వాళ్లు అక్కడే ఉండిపోవడంతో ఇదే అదనుగా భావించినఆత్రం ప్రశాంత్ తాళం వేసిన ఇంటిని గమనించి ఇంట్లోకి చొరబడి నలభై తులాల వెండి కడియాలు పట్టెలతో పాటు 20వేల నగదును దొంగిలించారు.
ఈనెల 8వ తేదీన దొంగతనం జరిగిన విషయం స్థానికులు మన్నె శేఖర్ కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు గమనించి 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఉదయం నిజాంసాగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అనుమానం వచ్చి ఆత్రం ప్రశాంత్ ను అదుపులోకి తీసుకోగా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు దీంతో అతనిని అదుపులోకి తీసుకొని 40 తులాల వెండి వస్తువులను 10,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.