20 March, 2026 | 7:14 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

బీజేపీ భారీ ర్యాలీ – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కలెక్టర్‌కు వినతిపత్రం

20-03-2026 02:48 PM

“6 గ్యారంటీలు ఎక్కడ? రైతు భరోసా, నిరుద్యోగ భృతి, పెన్షన్లపై కాంగ్రెస్‌ను నిలదీసిన బిజెపి”

హనుమకొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యలను ఎండ గడుతూ బిజెపి హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో అదాలత్ జంక్షన్ నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 హామీలను పూర్తిగా అమలు చేయడంలో  ఘోరంగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.

రైతు భరోసా ఇంకా పూర్తిస్థాయిలో అందలేదని, తీవ్ర ఆలస్యంతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ భృతి హామీ ఇప్పటికీ అమలు కాలేదని, యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు  అర్హులైన అందరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, పెన్షన్ ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత ఫీజు రీయింబర్స్‌మెంట్  లేక, ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.అలాగే 7, 10, 11, 54 డివిజన్లలో హిందూ శ్మశానవాటికలు సక్రమంగా మెయింటైన్ చేయడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బిజెపి పోరాటం ఆగదని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతదూరమైనా వెళ్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ,  డా. కాళి ప్రసాద్ , డా. విజయ్ చందర్ రెడ్డి , చాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్ , దొంతి దేవేందర్ రెడ్డి , గుజ్జా సత్యనారాయణ, నాను నాయక్ ,  కార్పొరేటర్లు చాడ స్వాతి , అభినవ్ భాస్కర్ , గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి , బైరి లక్ష్మి , రావుల కోమల , జిల్లా ప్రధాన కార్యదర్శులు జయంత్ లాల్ , డా. సండ్ర మధు , ఇతర జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.