22-02-2026 02:25:11 AM
పోలీసుల తీరుపై బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాం తి): ఢిల్లీ ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరును నిరసిస్తూ భారతీయ జన తా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం నాంపల్లిలోని గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రికత్త చోటు చేసుకుంది. బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి గాంధీ భవన్వైపు బీజేవైఎం కార్యకర్తలు దూసుకొస్తూ రాహుల్ గాంధీ,
కాంగ్రెస్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమం లో అక్కడ భారీగా పోలీసులు మోహరించి వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారు: బీజేపీ రాష్ట్ర చీఫ్
ఏఐ గ్లోబల్ సమ్మిట్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతో దేశమంతా కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నేరమన్నారు. ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.