బోనమెత్తిన బోధన్ మున్సిపల్ చైర్పర్సన్
20-07-2026 12:00 AM
బోధన్, జులై19 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సరస్వతి నగర్ లయోల పాఠశాల నుండి మిమ్స్ డి గ్రీ కళాశాల వరకు ఉన్న కాలానీల ప్రజలు పోతరాజులతో కలిసి భాజా బజంత్రీలతో కొత్త బస్ స్టాండ్ మీదుగా బయలుదేరి నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మ వారికి బోనాలు సమర్పించారు. అనంతరం షర్బతి కెనాల్ ప్రాంతంలో గల మహాలక్ష్మి అమ్మ వారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్బంగా బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు






