5 August, 2026 | 10:08 PM

ఆగస్టు 25న బోల్డ్ ఇవో, ఏస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణ

05-08-2026 09:20 PM

ముంబై, ఆగస్టు 4, 2026: ఫైర్-బోల్ట్ కు చెందిన హోమ్‌గ్రోన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన బోల్ట్, తన అత్యంత ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్‌లు  ఇవో మరియు ఏస్ 5జీ  రాబోయే లాంచ్‌ను  అధికారికంగా ప్రకటించింది. ఇవి ఆగస్టు 25, 2026న లాంచ్ కానున్నాయి.ఫ్రీడమ్ సేల్ 2026కు టైటిల్ స్పాన్సర్‌గా ఫ్లిప్‌కార్ట్‌తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా బ్రాండ్ వెల్లడించింది.

అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఈ నెలాఖరులో అధికారికంగా లాంచ్ కానున్నప్పటికీ, ఉత్పత్తి లాంచ్‌కు ముందే దేశవ్యాప్తంగా బలమైన అవగాహన మరియు బ్రాండ్ గుర్తింపును పెంచుకోవడానికి బోల్ట్ ఈ స్పాన్సర్‌షిప్‌ను ఇప్పుడే చేపడుతోంది. తన విస్తృత మార్కెట్-ఎంట్రీ వ్యూహంలో భాగంగా, డివైజ్ లాంచ్‌కు ముందు మెట్రో నగరాలతో పాటు టియర్ 2 మరియు టియర్ 3 మార్కెట్లలోని లక్షలాది వినియోగదారులను చేరుకోవడానికి ఈ స్పాన్సర్‌షిప్ ఒక హై-ఇంపాక్ట్ ప్లాట్‌ఫారంగా పనిచేస్తుంది.

ఫ్రీడమ్ సేల్ 2026 ఆగస్టు 7 (మెంబర్స్‌కు ఎర్లీ యాక్సెస్) నుండి ఆగస్టు 15 (సాధారణ అమ్మకం) వరకు జరుగుతుంది. ఇవో మరియు ఏస్ 5జీ పరిచయం బోల్ట్ బ్రాండ్ ప్రయాణంలో ఒక కీలక అధ్యాయం. ఆధునిక భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ రెండు పరికరాలు నమ్మదగిన పనితీరు, సొగసైన డిజైన్ మరియు రోజువారీ వినియోగసౌలభ్యాన్ని అర్థవంతమైన ఆవిష్కరణతో మిళితం చేస్తాయి, తద్వారా మారుతున్న డిజిటల్ జీవనశైలికి మెరుగైన తోడ్పాటునిస్తాయి.స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ధర, ఫుల్ స్పెసిఫికేషన్లు ,దేశవ్యాప్త లభ్యతకు సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్ కు ముందు ప్రకటించనుంది.