17-02-2026 04:10:18 PM
గుజరాత్: అహ్మదాబాద్, గాంధీనగర్లోని జిల్లా కోర్టులతో సహా గుజరాత్లోని ఆరు కోర్టులకు మంగళవారం ఈమెయిల్ల(Bomb threat emails) ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. అహ్మదాబాద్లోని కనీసం రెండు డజన్ల పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్లు వచ్చిన ఒక రోజు తర్వాత తాజా బెదిరింపు మెయిల్లు వచ్చాయి. వడోదర, వల్సాద్, రాజ్కోట్, అహ్మదాబాద్, గాంధీనగర్లోని జిల్లా కోర్టులను లక్ష్యంగా చేసుకుని తాజా బాంబు బెదిరింపు మెయిల్లు వచ్చాయి. కోర్టు అధికారిక చిరునామాకు బెదిరింపు ఇమెయిల్ వచ్చినట్లు పోలీసులు చెప్పారు. నివేదిక ప్రకారం, సీనియర్ పోలీసు అధికారులు వడోదర జిల్లా కోర్టుకు చేరుకుని కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేసి భద్రతా తనిఖీ ప్రారంభించారు. సోమవారం, అహ్మదాబాద్ తో పాటు 25 కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత అధికారులు క్యాంపస్లను ఖాళీ చేయించారు. గత నెల, గణతంత్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు, అనేక అహ్మదాబాద్ పాఠశాలలకు ఇలాంటి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.