06-02-2026 01:24:54 PM
జైపూర్: బాంబు బెదిరింపుల నేపథ్యంలో శుక్రవారం జైపూర్, జోధ్పూర్లోని రాజస్థాన్ హైకోర్టు(Rajasthan High Court) ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం, హైకోర్టు రిజిస్ట్రార్కు ఉదయం ఒక ఈమెయిల్ వచ్చింది. అందులో కోర్టు ప్రాంగణంలో మూడు బాంబులు అమర్చినట్లు పేర్కొన్నారు. హైకోర్టు పరిపాలన విభాగం పోలీసులకు సమాచారం ఇచ్చి, వెంటనే ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. జైపూర్, జోధ్పూర్లోని హైకోర్టు ప్రాంగణానికి బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలను తరలించారు.