14-06-2025 12:59:19 AM
-28 మంది మెడికల్ విద్యార్థుల కన్నుమూత
- మృతదేహాలకు కొనసాగుతున్న డీఎన్ఏ పరీక్షలు
అహ్మదాబాద్, జూన్ 13: పెను విషాదాన్ని మిగిల్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం మృతి చెందిన వారి సంఖ్య 269 మంది కాగా.. ఇందులో 241 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది కాగా.. మరో 28 మంది మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులు కూడా ఉన్నారు.
మరో విద్యార్థి ఆచూకీ గల్లంతయిందని సహాయక బృందాలు పేర్కొన్నాయి. గురువారం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఎయిర్పోర్టు సమీపంలోని మేఘానీనగర్ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలింది. అదే సమయంలో మెస్లో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులపై విమాన శకలాలు పడడంతో చాలా మంది అగ్నికి ఆ హుతి అయినట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు 28 మంది మరణించినట్టు పేర్కొన్నప్పటికీ ప రిస్థితి చూస్తుంటే మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగానే ఉండనుంది. ప్రమాదంలో గాయపడిన 50 మందికి పైగా విద్యార్థులు ఆ సుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వి మానం కూలిన సమయంలో అధిక వేడి కారణంగా చనిపోయినవారిని గుర్తించడం క ష్టతరంగా మారింది. భారీ మంటల కారణ ంగా మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ఆనవాళ్లు కూడా మిగల్లేదు. ప్రమాదం తర్వాత భా రీ మంటల్లో చాలా మంది కాలి బూడిదయ్యా రు.
దీంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. బీజే మెడికల్ కాలేజీ గ్రౌండ్ ఫ్లోర్లోని పీఎస్ఎం డిపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన టెస్టింగ్ సెంటర్లో డీఎన్ఏ నమూనాల ప్రక్రియ కొనసాగుతుంది. మృతదేహాల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపుతున్నారు. డీఎన్ఏ పోలిక ప్రక్రియకు కనీసం మూడు రోజులు సమయం పట్టే అవకాశముందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.