08-12-2025 08:35:52 AM
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే 3 విమానాలకు బాంబు బెదిరింపులు(Bomb threats) వచ్చాయి. బాంబు బెదిరింపులతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో(Shamshabad Airport) తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులను సురక్షితంగా దించిన అధికారులు విమానానాలను ఐసోలేషన్ కు తరలించారు. ఇండిగో, లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు