calender_icon.png 3 February, 2026 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు

03-02-2026 08:35:02 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట్ గ్రామంలో ఈనెల 2న ప్రారంభమైన ఎల్లమ్మ ఉత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం ఉదయం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. ఆలయం కు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు భారీ ఏర్పాట్లు చేశారు.

సాయంత్రం గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్ని వాడాల నుండి బోనాలను తీసి డప్పు వాయిద్యాలతో, శివసత్తులు నాటి నృత్యములతో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నాలుగవ తేదీన చక్కర తీర్థం, జాతర ఉత్సవాలు, ఒగ్గు కథ కాలక్షేపం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు మిద్దె రామ గౌడ్ మనవడి మిత్ర బృందంతో ఒగ్గు కథ కాలక్షేపం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట్ గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.