19-06-2025 05:34:26 PM
నిర్మల్ (విజయక్రాంతి): అఖిల భారత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి చరిత్రను తెలిపే పుస్తకాన్ని ఈనెల 22న నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించినట్టు కమిటీ సభ్యులు విగ్నేష్ శనిగరపు చిన్నయ్య(Committee Member Vignesh Shanigarapu Chinnayya) తెలిపారు. గురువారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ... అయ్యప్ప స్వామి చరిత్రను ప్రజలందరికీ చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జాప నరసయ్య జనార్ధన్ బద్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.