calender_icon.png 19 June, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాదాయ శాఖ ఉద్యోగులు అర్చకులకు వేతనాలు విడుదల చేయాలి

19-06-2025 05:46:00 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేసే అర్చక, ఉద్యోగులు రెండు నెలలుగా వేతనాల చెల్లింపు నిలిచిపోవడంతో అర్ధాకలి, అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డివిఆర్ శర్మ(JAC Convener DVR Sharma) అన్నారు. 577 జీఓ అమలుకు తూట్లు పొడుస్తున్నారని, ఒకే శాఖ ఒకే వేతన విధానం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని కురవి శ్రీ భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి ఆలయ అర్చక, ఉద్యోగులతో కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కురవి శ్రీవీరభద్రస్వామివారి దేవాలయ అర్చకులు రెడ్యాల శ్రీనివాస్ శర్మ, పెనుగొండ అనిల్ శర్మ, దూసకంటి విజయ్ శర్మ, అభిలాష్ శర్మ, రమేష్, వేదపండితులు బాలకృష్ణశర్మ, శ్రీకాంతాచార్యులు, ఉద్యోగి జగన్ పాల్గొన్నారు.