19-06-2025 05:30:49 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ సిపిఐ పట్టణ కమిటీని గురువారం ఎన్నుకున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్(District Secretary S. Vilas) తెలిపారు. పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించి పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బుక్కే రమేష్ సహాయ కార్యదర్శిగా నసీర్ ను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మరో 17 మందిని పట్టణ కమిటీలో చేర్చడం జరిగిందని ప్రజా సమస్యలపై సిపిఐ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పద్మాకుమారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.