calender_icon.png 21 June, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైకిల్ పై ఆడుకుంటూ బస్ కింద పడి బాలుడు మృతి..

21-06-2025 07:12:24 PM

జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో ఘటన..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): సైకిల్ పై ఆడుకుంటున్న బాలుడిని స్కూల్ బస్ ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్(Jagadgirigutta Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ రాష్ట్రానికి చెందిన ముఖేష్ చౌహన్ హైదరాబాద్ కు కుటుంబంతో వలస వచ్చి జగద్గిరిగుట్టలో వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ముఖేష్ చౌహన్ కుమారుడు జైసిత్ చౌహన్(10) ఆల్విన్ కాలనీలోని జీవన్ జ్యోతి స్కూల్ లో 4వ తరగతి చదువుతున్నాడు.

శుక్రవారం సాయంత్రం స్కూల్ టైమ్ అయిపోయ్యాక ఫ్రెండ్స్ తో కలిసి ఆల్విన్ కాలనీలోని తులసినగర్ లో సైకిల్ పై ఆడుకుంటున్నాడు. అదే సమయంలో కేపీహెచ్బీ కాలనీ గోకుల్ ప్లాట్స్ నడుపుతున్న క్వాంటం లీఫ్స్ స్కూల్ బస్ విద్యార్థులను దించేందుకు తులసీనగర్ కు వచ్చింది. సైకిల్ పై ఆడుకుంటున్న బాలుడు సడెన్ గా స్లిపై బస్సు ముందు టైర్ల కింద పడ్డాడు. బస్ డ్రైవర్ గమనించకుండా బస్ ను ముందుకు తీసుకుపోవడంతో బాలుడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. తండ్రి ముఖేష్ చౌహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.