25 February, 2026 | 6:14 PM

మహిళా న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ విధుల బహిష్కరణ

25-02-2026 12:00 AM

వేములవాడ, ఫిబ్రవరి 24,(విజయక్రాంతి): వేములవాడలోని న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు. బోధన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న జి. కళ్యాణిపై ఈ నెల 22న జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నిరసన చేపట్టారు. వేములవాడ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ప్రధాన ద్వారం ముందు నినాదాలు చేశారు.

దుండగులను కఠినంగా శిక్షించాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్ గౌడ్, పిట్టల మనోహర్, పెంటరాజు, కొడిమ్యాల పురుషోత్తం, మహిళా న్యాయవాదులు జక్కుల పద్మ, స్రవంతి, అపర్ణ, నాయిమా నాసారి తదితరులు పాల్గొన్నారు.