1 July, 2026 | 8:54 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

బ్రహ్మకుమారీస్ చీఫ్ దాది రతన్‌జీ మృతి

09-04-2025 01:24 AM
  1. సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్, గవర్నర్ 
  2. ఆమె మరణం విశ్వ ఆధ్యాత్మికతకు తీరని లోటు

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహినీజీ మంగళవారం కన్నుమూశారు. గత వారం రోజులు గా అనారోగ్యంతో బాధపడుతు న్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లోని అబూరోడ్‌లోని శాం తివన్‌లోని ట్రామా సెంటర్‌కు వై ద్యం కోసం తరలించారు.

దాది రతన్‌జీ పరిస్థితి మరింత విషమంగా మారి మంగళవారం తెల్లవారు జా మున మృతిచెందారు. ఆమె మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతాపం వ్యక్తం చేశారు. ‘దాదిజీ జీవితం ఆదర్శవంతం. ఆమె ఆధ్యాత్మిక బలానికి, నిర్మలత్వానికి, విశ్వ సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు’ అని సీఎం రేవంత్ కొనియాడారు.  దాది రతన్‌జీ మృతిపై గవర్నర్ స్పం దిస్తూ.. ‘ఆమె ఒక ప్రకాశవంతమైన మార్గదర్శి. ఆమె మరణం ఆధ్యాత్మిక సేవా రంగానికి అపారమైన నష్టం’ అని తెలిపారు.